మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర.. కరెక్టేనా..?

First Published Sep 3, 2020, 11:54 AM IST

దాదాపు అందరూ భోజనం ఒంటిగంటకు చేస్తారు కదా.. అయితే..  రెండు గంట నుంచి 3 గంటల మధ్యలో నిద్రపోవాలట. మధ్యాహ్నం నిద్రకు ఇదే కరెక్ట్ సమయమట.

రాత్రి పూట ఎన్నిగంటలు నిద్రపోయినా.. మధ్యాహ్నం కొద్ది సేపైనా నిద్రపోకుండా కొందరు ఉండలేరు. మధ్యాహ్నం భోజనం తర్వాత వారికి ఆటోమెటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. అయితే.. ఈ నిద్రవల్ల చాలా బద్ధకంగా తయారౌతారని కొందరు చెబుతుంటారు. కానీ.. బద్ధకం మాట పక్కన పెడితే.. మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.
undefined
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోతే.. వారికి మెమరీ పవర్ పెరుగుతుందట. కనీసం అరగంట నుంచి గంటపాటు నిద్రపోతే.. పిల్లలతోపాటు.. పెద్దలకు కూడా చాలా మంచిదని చెబుతున్నారు.
undefined
దాదాపు అందరూ భోజనం ఒంటిగంటకు చేస్తారు కదా.. అయితే.. రెండు గంట నుంచి 3 గంటల మధ్యలో నిద్రపోవాలట. మధ్యాహ్నం నిద్రకు ఇదే కరెక్ట్ సమయమట.
undefined
ఇటీవల నిపుణులు చేసిన ఓ సర్వేలో.. మధ్యాహ్నం గంట నిద్రపోయేవారు ఫిజికల్ గానూ, మెంటల్ గాను ఆరోగ్యంగా ఉంటారట. అదేవిధంగా మధ్యాహ్నం నిద్రపోని వారిపై కూడా పరిశోధనలు చేశారట.
undefined
నిద్రపోయే వారిని.. పోని వారిని పోల్చి చూడగా.. నిద్రపోని వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తేలింది. అంతేకాకుండా.. మధ్యాహ్నం నిద్రపోయే వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉందని చెబుతున్నారు.
undefined
చిన్నారులకైతే మధ్యాహ్నం నిద్ర చాలా అవసరమని చెబుతున్నారు. వారిలో మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుందట. తెలివితేటలు బాగా పెరుగుతాయని చెబుతున్నారు.
undefined
అంతేకాకుండా... మధ్యాహ్నం నిద్రపోయే చిన్నారులు చాలా ఆనందంగా ఉంటారని.. వారిలో ఐక్యూ లెవల్స్ బాగా పెరుగుతాయని చెబుతున్నారు.
undefined
click me!