కరోనా భయం.. విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎక్కువగా తీసుకొని..

First Published Sep 7, 2020, 12:24 PM IST


కాగా.. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడవం వల్ల వాంతులు, డీ హైడ్రేషన్, నిద్రపట్టకపోవడం, మానసిక సమస్యలు తలెత్తడం లాంటివి జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మనిషి శరీరంలో మిల్లీలీటర్ రక్తానికి 150 నానోగ్రాముల విటమిన్ డీ మాత్రమే అవసరమౌతుందట.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో.. ఈ వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులు తీసుకోవాలని ఆ మధ్య వాట్సాప్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి.
undefined
అందులో అల్లం, పసుపు ఎక్కువగా తీసుకోవాలని.. వాటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వాటి సమాచారం. వీటితోపాటు.. విటమిన్ డి ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవాలని పలువురు సూచించారు. వాటిని చాలా మంది ఫాలో అయ్యారు. అయితే.. అలా తీసుకోవడమే ఓ వ్యక్తి కొంపముంచింది.
undefined
విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. విపరీతంగా వాంతులు అవుతున్నాయని ఆస్పత్రిలో చేరాడు. తీరా చెక్ చేస్తే.. అతని శరీరంలో విటమిన్ డి ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే అతని ప్రాణాల మీదకు తెచ్చిందని వైద్యులు తెలిపారు.
undefined
కాగా.. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడవం వల్ల వాంతులు, డీ హైడ్రేషన్, నిద్రపట్టకపోవడం, మానసిక సమస్యలు తలెత్తడం లాంటివి జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మనిషి శరీరంలో మిల్లీలీటర్ రక్తానికి 150 నానోగ్రాముల విటమిన్ డీ మాత్రమే అవసరమౌతుందట. అంతకన్నా ఎక్కువగా తీసుకోకూడదట.
undefined
రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి విటమిన్ డి, పసుపు, చిరుధాన్యాలు తీసుకోవడం తప్పుకాదని.. అయితే.. ఎంత మొత్తం తీసుకోవాలో తెలియక.. ఎక్కువగా తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
undefined
ప్రతి ఒక్కరికీ ఒకే క్వాంటిటీ విటమిన్స్ అవసరం కావని నిపుణులు చెబుతున్నారు. వారి శరీరాన్ని బట్టి.. అవసరం అవుతాయని.. అది డాక్టర్లు, నిపుణుల సలహాతో తీసుకోవాలని వారు చెబుతున్నారు.
undefined
ఇక మరికొందరు అలొవెరా జెల్( కలబంద గుజ్జు) ఎక్కువగా తీసుకుంటున్నారట. ఇది తీసుకోవడం మంచిదే కానీ.. ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీనికి బదులు.. పాలల్లో పసుపు వేసుకోని తాగడం లేదా వేడి నీరు తాగడం మంచిదని చెబుతున్నారు.
undefined
ఇంకొందరు మార్కెట్లో లభించే డాబర్ చవన్ ఫ్రష్, అశ్వగంధ లాంటివి కూడా ఎక్కువ మొత్తంలో తీసుకున్నారట. దాని వల్ల తినే ఆహారం డైజెస్ట్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కాబట్టి.. వీటిని తక్కువ మొత్తంలొ తీసుకోవాలని సూచిస్తున్నారు.
undefined
click me!