మందార టీని ఎలా తయారుచేయాలంటే?
మందార పువ్వుల రేకులను తీసుకుని వాటిని నీటిలో వేసి బాగా కడగండి. తర్వాత ఒక గిన్నెలో 3-4 గ్లాసుల నీటిని పోసి బాగా మరిగించాలి. దీనిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్కను వేయాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలో మందార పువ్వుల రేకులను వేయాలి. రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత నీళ్లు ముదురు ఎర్రరంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ను ఆఫ్ చేయాలి. తర్వాత నీటిని వడకట్టి అందులో తేనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే వేడివేడి మందార టీని తాగొచ్చు.