ఇది నీటిలోని మలినాలను, బ్యాక్టీరియాలను, ఫంగస్ లను సహజంగా వడగట్టి శుద్ధమైన మంచి నీటిని మనకు అందిస్తుంది. కనుక మట్టి కుండలో నీటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇది శరీరంలోని మెటబాలిజంను (Metabolism) రేటును పెంచి తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో జీర్ణప్రక్రియ మెరుగుపడి జీర్ణకోశ సమస్యలు (Gastrointestinal problems) తగ్గుతాయి. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.