తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పల్లీలను (Peanuts) వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్ లో వేసుకొని ఇందులోనే వెల్లుల్లి, ఉప్పు, కారం, చింతపండు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, కొత్తిమీర, టమోటాలు, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకుని పక్కన పెట్టుకోవాలి.