నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? వీటితో ఈ సమస్యకు చెక్ పెట్టండి!

First Published Dec 8, 2022, 7:02 AM IST

సాధారణంగా నలుగురితో కలిసి మాట్లాడాలన్న నోటి దుర్వాసన సమస్య కారణంగా నలుగురిలోకి స్వేచ్ఛగా మాట్లాడటానికి ఇబ్బంది పడేవారు నల్లని ద్రాక్షతో వీటికి చెక్ పెట్టండి.
 

సాధారణంగా మన రోజువారి ఆహార వ్యవహారాల కారణంగా ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కేవలం ఈ నల్లని ఎండు ద్రాక్ష వల్ల ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మరి నల్లని ఎండిన ద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే...
 

అజీర్తి సమస్యలు తొలగిపోతాయి: అజీర్తి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి గ్లాస్ పాలలో ఐదు నుంచి ఏడు ఎండు ద్రాక్షలను వేసి పది నిమిషాల తర్వాత ఆ పాలను తాగటం వల్ల అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.
 

ముఖంపై మడతలు తొలగిపోతాయి:

ముఖంపై ముడతలు పడి త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్న వారు ఈ నల్లని ఎండు ద్రాక్షల మిశ్రమం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక పది నుంచి 12  నల్ల ఎండు ద్రాక్షను మిశ్రమంలో తయారుచేసి అందులోకి తేనె వేసి ఆ మిశ్రమాన్ని మొహానికి మసాజ్ చేసిన అనంతరం గోరువెచ్చని నీటితో మొహం కడగటం వల్ల ముఖం పై ఉన్నటువంటి ముడతలు తొలగిపోతాయి.

గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది:
ఎండు ద్రాక్షలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం మన శరీరంలో అధిక రక్తపోటును అలాగే మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

ఎముకలకు గట్టిదనం:
ఎండిన నల్ల ద్రాక్షలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల తరచూ వీటిని తీసుకుంటే మన శరీరంలో ఎముకలు దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా త్వరగా పెళుసుబారకుండా ఉంటాయి.

నోటి దుర్వాసన: ఎవరైతే నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారో అలాంటివారు రాత్రి పడుకునే సమయంలో ఒక 10 లేదా 12 నల్లని ఎండిన ద్రాక్షలను నీటిలో నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం ఆ నీటినీ పది నిమిషాలపాటు మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటిని తాగటం వల్ల నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందవచ్చు.

click me!