ఈ నెల 12న మనం దీపావళి పండుగను జరుపుకోకున్నాం. పండుగకు కొన్ని రోజులే ఉంది. కాబట్టి ఇప్పటికే పండుగకు అన్నీ సిద్దం చేసి పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తీరొక్క స్వీట్లను, పిండి వంటకాలను కూడా తయారుచేస్తారు. ఇవి లేకుండా పండుగను ఆస్వాధించడం కష్టమే. కానీ తీపిని, వేయించిన, కారంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడతారు. ఇంతేకాదు వీటన్నింటీ ఓవర్ గా తింటే మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మరి పండుగను ఆస్వాధించాలనుకుంటే ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..