పెరుగు అత్యంత ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాలలో ఒకటి. అందుకే భారతీయులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పెరుగు పెర్ఫెక్ట్ గా వచ్చేలా చేయడం ఒక కళ. నిజానికి పెరుగులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే పెరుగును స్టీల్ గిన్నె, గాజు పాత్రలో కాకుండా మట్టికుండలో వేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది పెరుగు రుచిని పెంచుతుంది. ఆహారాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. మట్టి పాత్రలో పెరుగును తయారు చేయడం ఎన్నో శతాబ్దాలుగా వస్తోంది. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో ఇది సాంప్రదాయ పద్ధతిగా ఉంది. మట్టికుండలో పెరుగును తయారుచేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..