Health tips: 45 రోజులు చక్కెర తినడం మానెస్తే నిజంగా బరువు తగ్గుతారా?

Published : Feb 14, 2025, 02:59 PM IST

మనం ఆహారం విషయంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే రేపు పెద్ద మార్పులకు దారితీస్తాయి. అయితే మనం ఏది ఫాలో అయినా పూర్తిగా తెలుసుకున్నాకే పాటించడం మంచిది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 45 డేస్ నో షుగర్ ఛాలెంజ్ నిజమేనా? దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
Health tips: 45 రోజులు చక్కెర తినడం మానెస్తే నిజంగా బరువు తగ్గుతారా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో 45 డేస్ నో షుగర్ ఛాలెంజ్ బాగా ట్రెండ్ అవుతోంది. చాలామంది దీన్ని ఫాలో కూడా అవుతున్నారు. 45 రోజులు చక్కెర వాడకపోతే కంటి చూపు బాగుందని, చర్మం కాంతివంతంగా మారిందని, బరువు కూడా తగ్గామని చాలా విషయాలు చెబుతున్నారు. ఇంతకీ వీటిలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

25
ఎంత చక్కెర?

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక వ్యక్తి రోజుకు ఒకటి నుండి రెండు టీస్పూన్లు (సుమారు 10 గ్రాములు) చక్కెర తీసుకోవచ్చని చెబుతున్నాయి. ప్రస్తుతం డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి వ్యాధులు పెరుగుతున్నందున చక్కెర లేకుండా జీవించమని ప్రజలకు సూచిస్తున్నారు. 

కానీ చక్కెరను మాత్రమే తగ్గించడం వల్ల అన్ని ప్రయోజనాలు లభిస్తాయని చెప్పలేం. మనం తినే బియ్యం, చపాతీలు కూడా చక్కెరలా పనిచేస్తాయి. కాబట్టి వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు కూడా పాటించాలి.

35
చక్కెర తినకపోతే?

మనం ఎంత చక్కెర తీసుకుంటున్నామో ఎప్పుడూ గమనించాలి. కొందరు చక్కెరకు బదులు బెల్లం లేదా నాటు చక్కెరను వాడుతుంటారు. కానీ వీటి మధ్య పెద్దగా తేడా లేదు. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకునేముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. సడెన్ గా పుడ్ హ్యాబిట్స్ ని మార్చితే కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

45
చక్కెర లేని ఛాలెంజ్!

మనం రోజూ తినే ఆహార పదార్థాల్లో కొన్ని ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అందులో చక్కెర ఒకటి. మనం ఎక్కువగా చక్కెర కలిపిన ఆహారాలు తినేటప్పుడు బరువు తగ్గడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. 

ఎక్కువ టీ, కాఫీ అలవాటు మీ ఆరోగ్యానికి పరోక్షంగా హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువ కాఫీ లేదా టీ తాగడం మంచిది కాదు. స్వీట్లు మధ్యాహ్న భోజనం తర్వాత తినడం మంచిది. రాత్రి, ఉదయం తినడం మానుకోవాలి.

55
ఉదయం ఏం తినాలి?

ఉదయాన్నే ఆవిరిలో ఉడికించిన ఇడ్లీని సాంబార్‌తో తినవచ్చు. కానీ దుంపలు, రైస్ లాంటివి తీసుకోవడం మానుకోవాలి. ఇవి ఎక్కువ కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటాయి. రాత్రి 8 గంటల లోపు భోజనం చేయాలి. పడుకునే 3 గంటల ముందు తినడం మంచిది. ఇలా మొత్తం ఆహారపు అలవాట్లను మార్చుకుని చక్కెర లేని ఛాలెంజ్‌ని పాటించవచ్చు. నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories