రక్తంలో చక్కెరను పెంచుతుంది
మైదా పిండిని డయాబెటీస్ ఉన్నవారు పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే ఈ పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు మైదా పిండితో చేసిన ఆహారాలను తిన్నట్టైతే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ వెంటనే పెరుగుతాయి.
ఎముకలు బలహీనపడతాయి
అవును మైదా పిండి మీ ఎముకలకు బలం లేకుండా చేస్తుంది. ఈ పిండిలో ఉండే మూలకాలు మన శరీరంలోకి వెళ్లగానే ఆమ్ల స్థాయిని పెంచుతాయి. దీంతో ఎముకలపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి.