పండ్లు, కూరగాయలు
అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా మంది పండ్లను, కూరగాయలను తినడం మానేస్తారు. కానీ ఈ టైంలో మీరు వీటిని ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే అనారోగ్యం నుంచి మీ శరీరం త్వరగా కోలుకుంటుంది. మీరు మీ ఆహారంలో బెర్రీలు, ఆకుకూరలు మొదలైన వాటికి సిట్రస్ పండ్లను చేర్చండి.