కావాల్సిన పదార్థాలు:
దహీ ఇడ్లీ తయారు చేసుకోవడానికి వీలైనంత వరకు మెత్తగా ఉండే 5 ఇడ్లీలను తీసుకోవాలి. అనంతరం సరిపడ పెరుగు, ఉప్పు, చక్కెర, సరిపడ నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమర్చి తరుగు, ఇంగువా, కొన్ని దానిమ్మ గింజలు, చల్ల మిరపకాయలను తీసుకోవాలి.
తయారీ విధానం:
ముందుగా పెరుగును తీసుకొని కాస్త పలుచగా అయ్యేందుకు నీటిని కలుపుకోవాలి. అనంతరం అందులో ఉప్పు, చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఫ్రిజ్లో పెడితే బాగుంటుంది. ఇడ్లీలు తయారు కాగానే పోపు కోసం సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చసుకోవాలి. అనంతరం అన్ని దినుసులను వేసి వేయించాలి.
ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వాటిలో ఇడ్లీలను తీసుకోవాలి. అనంతరం వాటిపై పెరుగును పొరలాగా పోసుకోవాలి. అప్పటికే తయారు చేసుకున్న తాలింపును ఇడ్లీలపై వేసుకోవాలి. అలాగే కాస్త పచ్చి మిర్చి తరుగు, దానిమ్మ గింజలను వేసుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే దహీ ఇడ్లీ రడీ అయినట్లే. ఒకవేళ మీ పిల్లలు ఇడ్లీ తినడానికి ఇష్టపడకపోయినా, ఇడ్లీలు మిగలినా ఇలా చేసేయండి.