పూరీలను తయారుచేసే ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు రవ్వను కలపండి. అలాగే దీంట్లోనే ఒక టీస్పూన్ నూనె, తగినంత వాటర్, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పూరీ పిండిని చిన్న చిన్న ఉండలుగా కట్టండి. వీటిని చపాతీలు చేసి నూనెలో వేయించండి. దీనివల్ల పూరీకి ఎక్కువ నూనె పట్టుకోదు. అలాగే పూరీ చాలా మెత్తగా వస్తుంది.