నిపుణులు ఏమంటున్నారంటే...
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశం వంటి వేడి ఎక్కువగా ఉండే దేశంలో.. ఒక వ్యక్తి రోజుకు 4-5 నానబెట్టిన బాదం కంటే ఎక్కువ తినకూడదు. బాదం పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె, మెదడు సమస్యలు, చర్మం, జుట్టు ఆరోగ్యం, మధుమేహం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలు తగ్గిపోతాయి. అయితే బాదం పప్పులను ఎక్కువగా తింటే మలబద్ధకం, చర్మవ్యాధులు, అధిక చెమట వంటి సమస్యలు వస్తాయి.