మొక్కలతో మాంసం.. జెనీలియా, రితేష్ న్యూ బిజినెస్

First Published Jul 22, 2020, 11:22 AM IST

వీరిద్దరూ కలిసి ఇప్పుడు భారత్ ప్రజలకు ‘ఇమేజిన్ మీట్స్’ ద్వారా మొక్కల ద్వారా తయారైన మాంసం ఉత్పత్తులను అందించనున్నారు

బాలీవుడ్ స్టార్ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జెనీలియా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటించి క్రేజ్ సంపాదించుకుంది. ఇక రితేష్.. ఇప్పటికీ సినిమాల్లో హీరోగా రాణిస్తూనే ఉన్నారు.
undefined
కాగా.. వీరిద్దరూ ఒకే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో... పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా.. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పిన జెనీలియా.. ఇంట్లోనే ఉంటున్నారు. కాగా.. ఈ సెలబ్రెటీ కపుల్ ఓ కొత్త రకం బిజినెస్ లోకి అడుగుపెట్టారు.
undefined
వీరిద్దరూ కలిసి ఇప్పుడు భారత్ ప్రజలకు ‘ఇమేజిన్ మీట్స్’ ద్వారా మొక్కల ద్వారా తయారైన మాంసం ఉత్పత్తులను అందించనున్నారు.
undefined
ఇవి మొక్కలతో తయారైనప్పటికీ వాసన, రుచి మాత్రం నిజమైన మాంసంలానే ఉంటాయట. జెనిలీయా, రితేష్‌లు ఈ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
undefined
జెనీలియా మరియు రితేష్ దేశ్‌ముఖ్‌లు దాదాపు నాలుగు సంవత్సరాలు నుంచి నాన్‌వెజ్‌కు స్వస్తి పలికారు. శాకాహారులుగా మారారు. ఇకపై శాకాహారులుగానే ఉండాలనే నిర్ణయం వారు అప్పటిలో తీసుకున్నారు.
undefined
దీంతో వారు ఆ మధ్య అమెరికాలో మొక్కలతో మాంసాహార పదార్థాలు తయారు చేయవచ్చనే విషయం తెలుసుకుని.. అప్పటి నుంచి వాటినే వారు స్వీకరిస్తున్నారట.
undefined
ఎంతో రుచికరంగానూ, ఆరోగ్యకరమైనవి కూడా కావడంతో ఇప్పుడు అమెరికాకు చెందిన గ్లోబల్ సంస్థ ఆర్చర్ డేనియల్స్ మిడ్‌ల్యాండ్ గుడ్ పుడ్స్‌ ఇనిస్టిట్యూట్‌తో కలిసి జెనీలియా, రితేష్‌లు భారత్‌లో ఈ వ్యాపారం ప్రారంభించబోతోన్నట్లుగా తెలిపారు.
undefined
త్వరలోనే ‘ఇమేజిన్ మీట్స్’ ద్వారా బిర్యానీ, కబాబ్ ఇంకా కూరల వంటి ఎన్నో ఉత్పత్తులను భారత ప్రజలకు అందించనున్నామని రితేష్ దంపతులు తెలిపారు.
undefined
click me!