పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఎంత ఎక్కువగా పండ్లు తీసుకుంటే అంత మంచిది. నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకుంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుకోగలుగుతాం. ఇంత మేలు చేసే పండ్లు అయినా సరే.. ఈ కింది పండ్లను మాత్రం ఉదయాన్నే పరగడుపున అస్సలు తీసుకోకూడదట. ఆ పండ్లు ఏంటో ఓసారి చూద్దాం..