ఇక మనలో కొందరు చేపల కూరలో పెరుగు కలుపుకొని తింటుంటారు. ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకుంటే కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. చర్మ సమస్యలు కూడా తప్పవని అంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం కూడా చేపలు వేడి చేస్తే పాలు, పెరుగు చలవా చేస్తాయి. ఇలాంటి రెండు విభిన్న లక్షణాలున్న ఆహార పదార్థాలను ఒకేసారి తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి.