జ్వరంతో ఉన్నవారు కోడిగడ్డు, చేప, మటన్ తినొచ్చా..? తింటే ఏమౌతుంది?

First Published May 14, 2021, 10:36 AM IST

 జ్వరంగా ఉన్నప్పుడు గుడ్డు, చేప తింటే ఏమౌతుందనే ప్రశ్నకు ఆరోగ్య నిపుణుల సమాధానం ఏంటంటే.., ఈ ఆరోగ్యకరమైన ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. 

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తిని ఉన్నప్పుడే.. వారు ఆరోగ్యంగా ఉండగలరు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే.. ఇది అత్యవసరమనే చెప్పాలి. మరి ఈ రోగనిరోధక శక్తి ఎలా వస్తుంది అంటే కేవలం.. ప్రోటీన్స్, న్యూట్రియన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు అనే సమాధానం వెంటనే వినపడుతుంది.
undefined
అయితే.. ప్రోటీన్స్ దక్కాలంటే.. చేప, గుడ్డు కచ్చితంగా తీసుకోవాలి. కానీ.. వీటిని జ్వరం వచ్చినప్పుడు తినొచ్చా.. తినకూడదా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది..? ఈ ప్రశ్నలకు నిపుణుల సమాధానమేంటో ఓసారి చూద్దాం..
undefined
జ్వరంగా ఉన్నప్పుడు గుడ్డు, చేప తింటే ఏమౌతుందనే ప్రశ్నకు ఆరోగ్య నిపుణుల సమాధానం ఏంటంటే.., ఈ ఆరోగ్యకరమైన ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
undefined
అంతేకాకుండా యాంటీబయాటిక్స్.. వ్యాధులు, వాటి ప్రభావాల నుండి కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని మీ శరీరానికి ఇస్తుంది.
undefined
అయినప్పటికీ, మీ జీవక్రియ బలహీనంగా ఉంటే లేదా మీరు వికారంతో బాధపడుతుంటే, పప్పులు, బియ్యం మరియు చిక్కుళ్ళు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లతో తయారు చేసిన సూప్, గంజి లేదా కిచిడీ వంటి భోజనం తీసుకోవాలి.
undefined
చేపలు, గుడ్లు చికెన్ వంటి మాంసాహారాల్లో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు బి 6 బి 12, జింక్ సెలీనియం వంటి వాటితో నిండి ఉన్నాయి. .
undefined
జ్వరం వచ్చిన సమయంలో వీటిని తినాలి అనుకుంటే.. బాగా ఉడకపెట్టినవి.. నూనె తక్కువగా ఉన్నవాటిని తినడం ఉత్తమం. అయితే.. దీనిని అందరూ తీసుకోవడం అంత మంచిదేమీ కాదు. వైద్యుల సలహా మేరకు గుడ్డు, చేపలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని బట్టి.. వారు ఏం తినాలో సలహా ఇస్తారు. సులభంగా అరిగేలా సూప్ లా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది.
undefined
click me!