జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
చాలా మందికి తిన్న తర్వాత జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అంటే తిన్నది అరగకపోవడం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇలాంటి వారికి లవంగాలు మంచి మేలు చేస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను తింటే జీర్ణ ఎంజైమ్ల స్రావం పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు.