3.భోజనం చేసిన తర్వాత మామిడి పండు తినడం...
చాలా మంది భోజనం చేసిన వెంటనే డెజర్ట్ లా మామిడి పండు తింటారు. ముఖ్యంగా బిర్యానీ లాంటివి హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ కోసం మామిడి పండు తినకూడదు. భోజనంలోని కేలరీలకు తోడు మామిడి కేలరీలు కూడా చేరితే.. జీర్ణక్రియ పై భారం పడుతుంది. ఇది అజీర్తి, గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన తర్వాత కనీసం 1 నుంచి 2 గంటల తర్వాత మాత్రమే పండు తినాలి.
4.వేగంగా తినడం...
ఏ ఆహారాన్ని అయినా బాగా నమిలి తింటేనే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. మామిడి పండును త్వరత్వరగా మింగేయడం వల్ల జీర్ణ ఏంజైమ్ లు సరిగా కలవవు. నిదానంగా నమిలి ఆస్వాదిస్తూ తింటేనే అది సులభంగా జీర్ణం అవుతుంది.
5.జ్యూస్ రూపంలో తీసుకోవడం...
చాలా మంది మ్యాంగో జ్యూస్ తాగడాన్ని ఇష్టపడతారు. మామిడి పండు జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల అందులో ఫైబర్ పోతుంది. ఫైబర్ లేకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. పండును పండులా తీసుకుంటేనే మంచి పోషకాలు లభిస్తాయి.