టికెట్ ధర రూ. 4 వేలు.. కల్పిత కథలు
ఈ ప్రదేశాన్ని చూడటానికి వచ్చే ప్రతి పర్యాటక విజిటర్ నుంచి ఫ్రాంకో ఏకంగా 35 పౌండ్లు (మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.4,000) ఎంట్రీ ఫీజుగా వసూలు చేసేవాడు. అక్కడికి వచ్చే పర్యాటకులకు రాతి స్తంభాలు, రాతి మెట్లు, పురాతన విగ్రహాలు, పక్కనే ఉన్న సరస్సును చూపిస్తూ బిల్డప్ ఇచ్చేవాడు. విజిటర్స్ పూర్తిగా నమ్మడానికి పెద్ద పెద్ద కల్పిత కథలు కూడా చెప్పేవాడు. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ కూడా ఈ ప్రదేశానికి వచ్చేవారని చెప్పేవాడు. అంతేకాదు, ప్రసిద్ధ నాటకం 'రోమియో అండ్ జూలియట్' లోని జూలియట్ కాపులెట్ తన యంగేజ్ ను ఈ ప్రదేశంలోనే గడిపిందని కథలు అల్లేశాడు.
ఈయూ యాప్లోనూ చోటు
ఫ్రాంకో తనను తాను ఒక సామాజిక కార్యకర్తగా, వ్యాపారవేత్తగా, ఆర్కెస్ట్రా కండక్టర్ అని చెప్పుకునేవాడు. అతను చెప్పే కథలు ఎంత ప్రభావవంతంగా ఉండేవి అంటే.. స్థానిక అధికారులు కూడా అతని మాటలు నమ్మి మోసపోయారు. చివరికి ఈ నకిలీ ప్రదేశాన్ని యూరోపియన్ యూనియన్ ఫండ్ చేసిన ఒక అధికారిక టూరిజం యాప్లో కూడా చేర్చారంటే అతను ఏ స్థాయిలో బురిడీ కొట్టించాడో అర్థం చేసుకోవచ్చు. 2005లో కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రాచీన ప్రాంతం బయటపడిందని, ఇక్కడ గ్రీక్, రోమన్ కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయని ప్రచారం చేశాడు.