ఇక మనదేశంలో..
భారతదేశం కూడా భూకంపాల నుంచి పూర్తిగా సురక్షితం కాదు. భారతీయ టెక్టానిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతూ యూరేషియన్ ప్లేట్ను ఢీకొంటూ ఉంటాయి. అందుకే హిమాలయ ప్రాంతంలో భూకంపాల ప్రమాదం అధికంగా ఉంది. జమ్మూ-కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలు అత్యంత ప్రమాద ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలు కూడా భూకంప ముప్పును ఎదుర్కొంటున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో కోట్లాది మంది భూకంప ప్రమాద ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అందువల్ల భూకంప నిరోధక నిర్మాణాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రజల్లో అవగాహన పెంపు వంటి చర్యలు భవిష్యత్తులో నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.