Train: రైలులో బైక్ వేరే ప్రాంతానికి పార్శిల్ చేస్తున్నారా? ఈ పత్రాలు, నిబంధనలు తెలీకపోతే ఫైన్ పడుతుంది

Published : Sep 08, 2026, 11:04 AM IST

Train: రైల్లో బైక్ ను వేరే ప్రాంతానికి పార్శిల్ చేయాలనుకుంటున్నారా? అయితే కొన్ని నియమాలు, నిబంధనలు తెలుసుకోవాలి. లేకపోతే ఫైన్ పడే అవకాశం ఉంది. ఆ బైక్ నిబంధనలేంటో తెలుసుకోండి.

PREV
13
రైల్లో బైక్ పార్శిల్

ఉద్యోగ రీత్యా వేరే ఊరు వెళ్లాలన్నా, సుదూర ప్రాంతాలకు మీ బైక్ తరలించాలన్నా భారతీయ రైల్వే అత్యంత చౌకైన, నమ్మకమైన మార్గం. అయితే చాలామంది సరైన సమాచారం లేక స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్ల వద్ద ఇబ్బందులు పడుతుంటారు. రైలులో బైక్ బుక్ చేసుకోవడానికి కొన్ని కీలక ధ్రువపత్రాలు తప్పనిసరి. బైక్ అసలు ఆర్సీ (RC), ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ కాపీ, మీ ఆధార్ కార్డు, చురుగ్గా పనిచేసే మొబైల్ నంబర్ సిద్ధం చేసుకోవాలి. ప్రయాణంలో వాహనానికి ఏదైనా నష్టం జరిగితే పరిహారం పొందడానికి ఫస్ట్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ బండి మీ పేరు మీద లేకపోతే, అసలు యజమాని సంతకం చేసిన అనుమతి పత్రం చూపించాల్సి ఉంటుంది. స్టేషన్‌లోని పార్సిల్ కార్యాలయంలో ఇచ్చే దరఖాస్తులో గమ్యస్థానం, బండి వివరాలు పూరించాలి. అధికారులు వాహనం బరువును తూచి ఛార్జీలను నిర్ణయిస్తారు. సైకిల్ తీసుకెళ్లాలన్నా సాధారణ బ్యాగుల్లా తీసుకెళ్లడానికి వీల్లేదు, ప్రత్యేక లగేజీగా బుక్ చేసుకోవాలి

23
నిబంధనలు ఇవే

రైలు ప్రయాణంలో భద్రత అత్యంత కీలకం కాబట్టి రైల్వే శాఖ కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. బైక్ ట్యాంకులోని పెట్రోల్‌ను పూర్తిగా ఖాళీ చేసిన తర్వాతే బుకింగ్‌కు అనుమతిస్తారు. ట్యాంకులో కొద్దిగా ఇంధనం కనిపించినా నిబంధనల ఉల్లంఘన కింద పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు. ప్రయాణంలో గీతలు పడకుండా, విడిభాగాలు విరిగిపోకుండా ఉండటానికి సైడ్ మిర్రర్లను తొలగించాలి. స్టేషన్ ప్రాంగణంలో ఉండే నిపుణులతో బండికి గడ్డి, గోనె సంచులతో గట్టిగా ప్యాకింగ్ చేయించాలి. ఈ ప్యాకింగ్‌కు వాహనం సైజును బట్టి సుమారు మూడు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు తీసుకుంటారు. ఎనిమిది వందల కిలోమీటర్ల దూరానికి బైక్ పంపడానికి ప్యాకింగ్, రవాణా ఛార్జీలతో కలిపి సుమారు మూడు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.

33
రసీదు జాగ్రత్త

పార్సిల్ బుకింగ్ పూర్తయిన వెంటనే అధికారులు ఒక రసీదు ఇస్తారు. ఈ రసీదును అత్యంత భద్రంగా ఉంచుకోవాలి. గమ్యస్థానం స్టేషన్‌కు చేరుకున్నాక ఈ అసలు రసీదు చూపిస్తేనే అధికారులు వాహనాన్ని అప్పగిస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు వెళ్లే రైలులోని లగేజీ బోగీలో ఖాళీ స్థలం లేకపోతే, రైల్వే సిబ్బంది మీ బండిని ఆ తర్వాత వచ్చే వేరే రైలులో పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి గమ్యస్థానానికి వెళ్లాక స్టేషన్ పార్సిల్ విభాగంలో విచారించి బైక్ వచ్చిందో లేదో తెలుసుకోవాలి. మీ వాహనం స్టేషన్‌కు చేరుకున్న తర్వాత సకాలంలో డెలివరీ తీసుకోవడం మంచిది. ఆరు రోజుల కంటే ఎక్కువ కాలం స్టేషన్ ప్రాంగణంలోనే వాహనాన్ని వదిలేస్తే, రైల్వే శాఖ అదనంగా పార్కింగ్ లేదా డెమరేజ్ ఛార్జీలను వసూలు చేస్తుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి గందరగోళం లేకుండా మీ టూ-వీలర్‌ను సురక్షితంగా చేరవేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories