Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?

Published : Jul 27, 2026, 12:28 PM IST

Pani Puri: అందరూ ఇష్టంగా తినే పానీపూరీ మొదట ఎక్కడ పుట్టింది? దీనిని మొట్టమొదటిసారి ఎవరు తయారు చేశారో తెలుసా? ఈ పానీపూరీకి మహాభారతానికి సంబంధం ఏంటి? మొదటిసారి దీనిని ఎవరు తయారు చేశారు..?

PREV
13
Pani Puri

పానీపూరీ ఇష్టం లేని వాళ్లు చాలా అరుదు. చిన్న గ్రామం నుంచి పెద్ద పెద్ద పట్టణాల వరకు పానీపూరీ బండి లేని ప్లేస్ లేదు. ఇక.. సిటీల్లో అయితే.. సందుకో పానీపూరీ బండి ఉంటుంది. కేవలం పానీపూరీ బండి పెట్టుకొని.. లక్షల్లో సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఆ పానీపూరీని మొదట ఎవరు తయారు చేశారు అని అడిగితే మీరు సమాధానం చెప్పగలరా? ఈ పానీపూరీకి.. మహా భారతానికి కూడా సంబంధం ఉందని మీకు తెలుసా? ఈ కథేంటో ఇప్పుడు చూద్దాం..

23
పానీపూరీకి మహాభారతానికి సంబంధం ఏంటి?

పురాణాల కథ ప్రకారం.. ద్రౌపది మొదటిసారి ఈ పానీపూరీ తయారు చేశారట. ద్రౌపది.. పాండవులను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పాండవులతో వివాహం తర్వాత కుంతీ దేవి( పాండవుల తల్లి)... తన కోడలు ద్రౌపదికి ఓ పరీక్ష పెట్టాలని అనుకుందట.చాలా తక్కువ మొత్తంలో ఆహార పదార్థాలు ఇచ్చి.. వాటితో తన ఐదుగురు కుమారులకు సరిపోయేలా భోజనం తయారు చేయమని చెప్పిందంట. అంటే... కేవలం ఒకరికి మాత్రమే సరిపోయేలా రోటీ పిండి, బంగాళదుంపలు ఇచ్చి. ఐదుగురికి భోజనం తయారు చేయమని చెప్పారు. ద్రౌపది ఎంత సమర్థవంతంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందో తెలుసుకోవాలని కుంతీదేవి అనుకున్నారు. అయితే.. ద్రౌపది చాలా తెలివిగా.. ఆ కొద్ది పిండితో చిన్న చిన్న పూరీలు చేసి..అందులో బంగాళదుంపల కూర చేసి.. వాటిలో పెట్టి అందించారు. అందరి ఆకలి తీర్చారట.ద్రౌపది తెలివికి కుంతీదేవి మురిసిపోయారట. ఈ వంటకం ఎప్పటికీ అంతరించిపోకూడదని వరం కూడా ఇచ్చారట. అప్పటి నుంచే.. ఈ పానీపూరీ తయారీ అమలులోకి వచ్చందనే నానుడి ఉంది.

33
మరో కథ..

ఈ పానీపూరీ వెనక మరో కథ కూడా ఉంది.పూర్వం మగథ అనే రాజ్యం ఉండేది. ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలో కొంత భాగం అది. మొట్టమొదటిసారి పానీపూరీ అక్కడే తయారైందనే నమ్మకం కూడా ఉంది. అప్పటి వరకు అక్కడ ఉప్పు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు తినేవారట. దానికి భిన్నంగా ఈ పానీపూరీని తీసుకువచ్చారని అక్కడివారు నమ్ముతారు. అప్పట్లో ఈ వంటకాన్ని ఫుల్కీ అని పిలిచేవారు. తర్వాతర్వాత అది పానీపూరీగా మారిందని అక్కడివారి నమ్మకం.

అయితే.. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా పానీపూరీ లభిస్తున్నా.. ఒక్కో ప్లేస్ లో దాన్ని ఒక్కోలా తయారు చేస్తారు. పైన పూరీ అన్నిచోట్లా ఒకేలా ఉన్నా... లోపల స్టఫ్ఫింగ్ మాత్రం మారుతూ ఉంటుంది. ఆ నీటికి కూడా ఒక్కో చోట ఒక్కో రుచి ఉంటుంది. దీనిని మొదట ఎవరు తయారు చేసినా.. ఇప్పుడు మాత్రం కొన్ని లక్షల మంది ఫేవరేట్ ఫుడ్ గా మారిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories