UPI Charges : యూపీఐ పేమెంట్స్ పై ఇక ఛార్జీలా? లోక్ సభలో బిల్లు ఇందుకేనా? రూ.2000 దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

Published : Aug 06, 2026, 12:51 PM ISTUpdated : Aug 06, 2026, 01:06 PM IST

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించవచ్చనే వార్తలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యులపై ప్రభావం ఉంటుందా? లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లు యూపీఐ చార్జీల కోసమేనా? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

PREV
15
యూపీఐ లావాదేవీలపై ఇక ఛార్జీలా?

UPI Payments : భారతదేశంలో జరిగే డిజిటల్ చెల్లింపులకు యూపీఐ ఇప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కోట్లాది మంది ప్రతిరోజూ దీన్ని వాడుతున్నారు… వందలు వేలు కాదు లక్షలకోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. రోడ్డుపక్కన కూరగాయలు అమ్మేవారి నుండి అంబానీ, అదానీ వంటివారు కూడా ఆర్థిక లావాదేవీలకు యూపిఐ వాడుతున్నారు.

అయితే ఇప్పటివరకు సామాన్యులు యూపిఐ ద్వారా జరిపే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు…. కానీ ఇకపై ఇలాగే ఉంటుందా? యూపీఐ ద్వారా డబ్బు పంపితే ఛార్జీలు పడతాయా? అనే ప్రశ్న చాలామందిలొ మొదలైంది. దీనికి కారణం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'చెల్లింపులు, పరిష్కార వ్యవస్థల చట్ట సవరణ బిల్లు (Taxation and Other Laws (Amendment) Bill, 2026)'. ఈ బిల్లులోని కొన్ని ప్రతిపాదనలు యూపీఐ వాడకంలో కొత్త మార్పులు తీసుకురావచ్చని వార్తలు వస్తున్నాయి.

25
యూపిఐ పేమెంట్స్ పై సర్వీస్ చార్జీలుంటాయా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సవరణ బిల్లుపు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే యూపీఐ, రూపే ద్వారా జరిగే వ్యాపార (Merchant) లావాదేవీలపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR) విధించేలా చట్టంలో మార్పును ప్రతిపాదించారు. 

ఏమిటీ MDR?

యూపిఐ ద్వారా సామాన్య ప్రజలు చేపట్టే పేమెంట్స్ కి ఎలాంటి ఛార్జీలు ఉండవు... కానీ కొందరు వ్యాపారులకు యూపిఐ సర్వీస్ అందించినందుకు బ్యాంకులు లేదా పేమెంట్స్ యాప్స్ కొంత ఛార్జ్ వసూలు చేస్తాయి. దీనిపై ఎండిఆర్ (మర్చంట్ డిస్కంట్ రేట్) అంటారు. ఇది యూపిఐ ద్వారా జరిగే పేమెంట్ ను బట్టి ఉంటుంది.

అయితే ప్రస్తుతం చాలా వరకు యూపీఐ లావాదేవీలు ఉచితంగానే జరుగుతున్నాయి. కానీ భవిష్యత్తులో కొన్ని రకాల వ్యాపార లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడానికి చట్టపరమైన ఆధారాన్ని కల్పించడానికి కేంద్రం సవరణ బిల్లు తీసుకువస్తున్నట్లుగా కనిపిస్తోంది.

35
సాధారణ యూపిఐ పేమెంట్స్ పై నో ఛార్జెస్

అయితే సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి (P2P) యూపీఐ ద్వారా పంపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. స్నేహితులు, బంధువులు లేదా కుటుంబ సభ్యులకు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా డబ్బు పంపడం ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతుంది. రోజువారీ చిన్న చిన్న ఖర్చులకు యూపీఐ వాడే సాధారణ కస్టమర్లపై ఈ మార్పు వల్ల ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు.

45
వ్యాపారులపై ప్రభావం..

ఈ ప్రతిపాదన ప్రభావం ప్రధానంగా పెద్ద వ్యాపార సంస్థలపైనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏడాదికి రూ.15 కోట్ల కంటే ఎక్కువ వ్యాపార ఆదాయం ఉన్న కంపెనీలు లేదా నిర్దిష్ట పరిమితికి మించిన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై మాత్రమే MDR ఛార్జీ విధించవచ్చని సమాచారం. అంతేకాకుండా రూ.2,000 దాటిన వ్యాపార యూపీఐ లావాదేవీలపై 0.2% నుంచి 0.3% వరకు MDR వసూలు చేయవచ్చనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక, తుది ప్రకటన వెలువడలేదు.

55
ఆందోళన వద్దు..

అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మార్పు ఇంకా అమల్లోకి రాలేదని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇది లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులోని ఒక ప్రతిపాదన మాత్రమే. పార్లమెంట్ ఆమోదం, ప్రభుత్వం తుది నిర్ణయం, ఎన్‌పీసీఐ జారీ చేసే అధికారిక మార్గదర్శకాల తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. అప్పటివరకు ప్రజలు వాడే సాధారణ యూపీఐ లావాదేవీల్లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి అనవసరంగా గందరగోళ పడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు.

 

Read more Photos on
click me!

Recommended Stories