కథ..
ఒకసారి అడవిలోని అన్ని జంతువులు కలిసి మాట్లాడుకుంటున్నాయి. అడవికి రాజు సింహం మాట్లాడుతూ ‘‘ నేను ముసలిదాన్ని అయిపోయాన్నేమో.. సరిగా వేటాడలేకపోతున్నాను’’ అని నిరాశగా చెప్పింది. ఆ మాటకు పక్కనే ఉన్న ఏనుగు వెంటనే నవ్వేసింది. వెంటనే మాట్లాడుతూ.. ‘ నువ్వు ఒక్కసారి ఓడిపోయావని నీ శక్తి తక్కువైందని కాదు, నిన్ను చూసి మేము ఇంకా గర్వపడుతున్నాం’ అని ధైర్యం నింపింది.
పక్కనే ఉన్న ఓ చిన్న పక్షి వెంటనే ‘‘ నేను మొదట ఎగరడం నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు పడిపోయానో లెక్కే లేదు. కానీ, ప్రతిసారీ లేచి మళ్లీ ప్రయత్నించాను. ఇప్పుడు నేనే ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్నాను’ అని తన అనుభవాన్ని చెప్పింది.
ఈ మాటలు విన్న సింహానికి ఉత్సాహం వచ్చింది. ‘ నిజమే, నేను నిన్న వేటలో ఓడిపోయాను. కానీ ఈ రోజు వేటాడో శక్తి కోల్పోలేదు. ఓటమి అంటే అంతం కాదు, ఆరంభం’ అని అంది. ఆ మాటలకు అడవిలోని మిగిలిన జంతువులన్నీ సంతోషించి, చప్పట్లు కొట్టాయి. ఆ రోజు నుంచి సింహం మరింత ఎక్కువ శ్రమించింది... తిరిగి తన నైపుణ్యాన్ని సాధించింది.