పాకిస్థాన్లో అత్యధిక హిందువులు ఉన్న ప్రావిన్స్ సింధ్… ఇందులోనూ థార్పార్కర్, ఉమర్కోట్, మీర్పూర్ ఖాస్, సంఘర్ వంటి జిల్లాల్లో హిందువులు ఎక్కువగా కనిపిస్తారు. ముఖ్యంగా భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న థార్పార్కర్, ఉమర్కోట్ ప్రాంతాల్లో హిందూ సంస్కృతి ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి… అంటే ఇక్కడ హిందువులు అధికంగా ఉంటారన్నమాట.
థార్పార్కర్ జిల్లాలోని ప్రధాన నగరం మిథీలో ముస్లింల కంటే హిందువుల జనాభే ఎక్కువ… ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదే నిజం. ఈ నగరంలో మొత్తం 87 వేల జనాభా ఉండగా, అందులో 80% మంది హిందువులే… ముస్లింలు 20 శాతంలోపే ఉంటారు. ఇలా హిందువులు మెజారిటీగా గల నగరం పాకిస్థాన్ లో ఉందని చాలామందికి తెలియదు.
ఈ మిథీ నగరం ప్రత్యేకత ఏంటంటే… ఇక్కడ ప్రతి వీధిలో హిందూ దేవాలయం కనిపిస్తుంది… చాలామంది నుదుట బొట్టు పెట్టుకుని కనిపిస్తుంది. ఇక్కడ మసీదుల కంటే గుడులే ఎక్కువ.. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఈ నగరంలో గోవధ నిషేధం ఉంది. అంటే గోవును పూజించడానికే తప్ప దాన్ని వధించి మాంసం అమ్మడానికి ఉపయోగించరాదు.