DAIS బాలీవుడ్, వ్యాపార కుటుంబాలకు మొదటి ఎంపిక. షారుఖ్ కొడుకు అబ్రామ్ చదివేది కూడా ఇక్కడే. అంతేకాదు చాలామంది బాలీవుడ్ స్టార్స్ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. అందుకే ఇక్కడి ఈవెంట్స్ వైరల్ అవుతాయి.
ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో ఈ పాఠశాల ఉంది. దీనిని 2003లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించింది. ఈ పాఠశాలకు నీతా అంబానీ వ్యవస్థాపక చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు.
భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, టాప్ ర్యాంక్ విద్యాసంస్థల్లో ఒకటి. 1,30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ల్యాబ్లు, డిజిటల్ క్లాస్రూమ్లు, స్పోర్ట్స్ సెంటర్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉంది.