పూజకు అవసరమైన ఏ ఇతర పదార్థాలు, ఆడంబరాలు లేకపోయినా కేవలం ఒక చిన్న పాత్రతో నీరు, ఒక మారేడు దళం సమర్పిస్తే చాలు శివుడు ప్రసన్నుడవుతాడని శివపురాణంలో ఒక వేటగాని కథ ద్వారా తెలుస్తుంది.
అడవిలో ఒక వేటగాడు తెలియకుండానే రాత్రి వేళ చెట్టుపై నుంచి శివలింగంపై నీటి చుక్కలు, మారేడు ఆకులను పడేలా చేస్తాడు. ఎలాంటి అడంబరాలు లేకుండా, కేవలం అనుకోకుండా పడిన ఆ నీరు, మారేడు ఆకులకే పరమశివుడు ప్రీతి చెంది ఆ వేటగానికి ముక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి నిశ్చలమైన భక్తితో సమర్పించే నీరు, బిల్వపత్రం శివ పూజను సంపూర్ణం చేస్తాయి.
శివ ఆరాధనలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
శివుడు భోళాశంకరుడు. ఆడంబరాల కంటే భక్తుల అంతఃకరణ శుద్ధి, నిష్టకే ప్రాధాన్యం ఇస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి.
• మహిళలు ఎలాంటి అపోహలు లేకుండా రుద్రాక్ష ధరించవచ్చు.
• అభిషేకం సమయంలో ఉత్తర దిశ ప్రాధాన్యం గుర్తుంచుకోవాలి.
• పూజా సామగ్రి కొరత ఉన్నా నీరు, బిల్వపత్రంతో శివారాధన పూర్తి చేయవచ్చు.