Vijay Rashmika Wedding: గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్‌, హాజరైన గెస్ట్ లు వీరే.. సాయంత్రం మరో పెళ్లి

Published : Feb 26, 2026, 08:33 AM ISTUpdated : Feb 26, 2026, 10:30 AM IST

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఒక్కటయ్యారు. మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితం స్టార్ట్ చేశారు. వీరి మ్యారేజ్‌ ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది.   

PREV
15
గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లి

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఎట్టకేలకు ఒక్కటయ్యారు. వీరి మ్యారేజ్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితం స్టార్ట్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతికొద్ది మంది బంధుమిత్రులు, సెలబ్రిటీల సమక్షంలో విరోషి(విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా) ఒక్కటయ్యారు. దాదాపు ఏడేళ్ల ప్రేమ జీవితానికి తెర దించుతూ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇన్నాళ్ల రహస్యాన్ని బహిర్గతం చేశారు.

25
రెండు సాంప్రదాయాల ప్రకారం విజయ్‌, రష్మిక మ్యారేజ్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్‌ ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఉదయం 9-10 గంటల మధ్యలో రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు విజయ్‌. అయితే వీరి మ్యారేజ్‌ని రెండు సాంప్రదాయల ప్రకారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్‌ జరగ్గా, సాయంత్రం కొడుగు(కొడవ) సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకోబోతున్నారు. కొడవ అనేది రష్మిక మందన్నా వారి సాంప్రదాయం కావడం విశేషం.

35
ఫోటోలు, వీడియోలు లీక్‌ కాకుండా జగ్రత్త

అయితే పూర్తి ప్రైవేట్‌ ఈవెంట్‌గా జరిగిన వీరి మ్యారేజ్‌ వేడుకకి సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా విజయ్‌, రష్మిక జాగ్రత్త పడ్డారు. అతిథులకు కండీషన్స్ కూడా పెట్టారు. అయినా చిన్న చిన్న వీడియో క్లిప్ లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కానీ మ్యారేజ్‌ ఫోటోలను ఈ జంట అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

45
విరోషి వెడ్డింగ్‌కి హాజరైన గెస్ట్ లు వీరే

 విజయ్‌ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారనేది చూస్తే.. సందీప్‌ రెడ్డి వంగా, తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా, రాహుల్‌ రవీంద్రన్‌ వంటి వారు హాజరైనట్టు తెలుస్తోంది. ఆనంద్‌ దేవరకొండ, విజయ్‌ ఫ్యామిలీ, వారి దగ్గరి బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారట. అలాగే రష్మిక మందన్నా దగ్గరి బంధువులు మాత్రమే వీరి మ్యారేజ్‌కి హాజరయ్యారు. చాలా లిమిటెడ్‌లో ఫ్రెండ్స్ ఉన్నట్టు సమాచారం. అలాగే అతికొద్ది మంది కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా పాల్గొంటారని టాక్‌.

55
`గీతగోవిందం`తో ప్రారంభమైన జర్నీ

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా `గీత గోవిందం` లో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత `డియర్‌ కామ్రేడ్‌`లో మరోసారి జోడీ కట్టారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల రిలేషన్‌ అనంతరం గురువారంతో ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఇక వీరి రిసెప్షన్‌ మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణలో జరగబోతుంది.   సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, కార్పొరేట్లు ఈ రిసెప్షన్‌కి హాజరయ్యే అవకాశం ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories