ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంగీత్ కార్యక్రమంలో ఓ ప్రత్యేకమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఉదయ్పూర్లో విజయ్-రష్మిక పెళ్లి వేడుకలు చాలా ప్రైవేట్గా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో ఓ స్పెషల్ మూమెంట్ జరిగినట్టు తెలుస్తోంది. ఇండియా టుడే కథనం ప్రకారం, విజయ్ తల్లి మాధవి దేవరకొండ.. రష్మికకు తమ కుటుంబ వారసత్వ గాజులను బహుమతిగా ఇచ్చారు. తమ ఇంటి కోడలిగా ఆమెను మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి గుర్తుగా ఈ గాజులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
23
తెరపై మొదలైన ప్రేమకథ
2018లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా సెట్లో విజయ్, రష్మికల ప్రయాణం మొదలైంది. ఈ సినిమా బ్లాక్బస్టర్ అవ్వడంతో పాటు, వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత 2019లో 'డియర్ కామ్రేడ్'తో మళ్లీ కలిశారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ వెకేషన్లు, డిన్నర్లలో కలిసి కనిపించడంతో ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అభిమానులు ముద్దుగా ఈ జంటను 'విరోష్' అని పిలుచుకుంటున్నారు.
33
'విరోష్' పెళ్లి.. తర్వాత ఏంటి?
ఫిబ్రవరి 22న ఈ జంట తమ పెళ్లి విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఉదయ్పూర్లో జరుగుతున్న పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. అయితే, మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణా హోటల్లో సినీ పరిశ్రమ స్నేహితులు, ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.