20 ఏళ్లకు పైగా హీరోయిన్ గా...
తమిళంతో పాటు తెలుగులో కూడా నయనతార స్టార్ హీరోయిన్ గా వెలుగువెలుగుతోంది. అభిమానులు ఆమెను 'లేడీ సూపర్ స్టార్' అని పిలుచుకుంటారు. 2005లో వచ్చిన 'జయా' సినిమాలో శరత్కుమార్కు జోడీగా ఆమె తమిళ తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రజినీకాంత్, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.
తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య, లాంటి స్టార్స్ సరసన మెప్పించింది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి నయనతారనే. ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది.