Tollywood: ఒక సినిమాలో వచ్చిన సన్నివేశాలు మరో సినిమాలో రావడం కామన్. దీనిని కొందరు కాపీ అంటే మరికొందరు ఇన్స్పిరేషన్ అని అంటుంటారు. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో బయటకు వచ్చింది.
1991లో విడుదలైన ‘రౌడీ గారి పెళ్లాం’ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మోహన్ బాబు హీరోగా నటించగా, శోభన హీరోయిన్గా కనిపించింది. సినిమాలో మోహన్ బాబు తనదైన శైలిలో నటిస్తూ కథను ముందుకు తీసుకెళ్తాడు. యాక్షన్, ఎమోషన్ కలిసిన కథలో ఒక ముఖ్యమైన సన్నివేశం ఆసుపత్రిలో జరుగుతుంది. అదే తర్వాతి కాలంలో వచ్చిన మరో సినిమాలో కనిపించడం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది.
25
శోభన ఆత్మహత్యాయత్నం..
సినిమాలో ఒక కీలకమైన సమయంలో శోభన తీవ్ర ఆవేదనతో కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేస్తుంది. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో మోహన్ బాబు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు వెంటనే చికిత్స అవసరం ఉన్నప్పటికీ ఆసుపత్రి వైద్యుడు వెంటనే వైద్యం చేయడానికి ముందుకు రాడు.
35
‘ముందు పోలీస్ కేసు పెట్టాలి’.. డాక్టర్ వాదన
ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ ఒక నిబంధనను చూపిస్తూ ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అంటాడు. పోలీస్ కేసు నమోదు చేసిన తర్వాతే వైద్యం చేయగలమని చెబుతాడు. ఈ మాటలు విన్న వెంటనే మోహన్ బాబు కోపంతో రగిలిపోతాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడడం ముఖ్యం కాదా అని డాక్టర్తో వాదిస్తాడు. అయితే డాక్టర్ తన నిర్ణయాన్ని మార్చకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది.
డాక్టర్ స్పందనపై తీవ్రంగా ఆగ్రహించిన మోహన్ బాబు అతనిపై దాడి చేస్తాడు. దీంతో డాక్టర్ గాయపడి రక్తం కారుతుంది. అక్కడే ఉన్న నర్సులు వెంటనే డాక్టర్కు చికిత్స చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే అప్పుడే మోహన్ బాబు అదే డాక్టర్ చెప్పిన నిబంధనను తిరిగి గుర్తు చేస్తాడు. “ముందు పోలీసులకు ఫిర్యాదు చేయండి.. తర్వాతే వైద్యం చేయండి” అంటూ డాక్టర్ మాటలనే అతనిపై ప్రయోగిస్తాడు. ఈ సన్నివేశం అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
55
పోకిరీ సినిమాలో కూడా అదే తరహా సీన్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇలాంటి సన్నివేశమే మహేష్ బాబు – ఇలియానా నటించిన ‘పోకిరీ’ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఆ సినిమాలో ఇలియానాకు చిన్న గాయం అవుతుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్తో జరిగే వాగ్వాదం, పరిస్థితిని హీరో తన స్టైల్లో హ్యాండిల్ చేసే విధానం ప్రేక్షకులకు గుర్తుండే సన్నివేశంగా మారింది. ఇలా చూసుకుంటే దాదాపు 35 ఏళ్ల క్రితమే ‘రౌడీ గారి పెళ్లాం’ సినిమాలో కనిపించిన ఆలోచనను తర్వాత ‘పోకిరీ’ సినిమాలో మరో రూపంలో చూపించినట్లుగా అనిపిస్తుందని చాలా మంది సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ కూడా కాపీ చేశారా అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ బాబు సినిమాలోని వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.