ఈ సినిమా కాకుండా శరణ్య మోహన్ 30కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె కల్యాణ్ రామ్ కు చెల్లెలిగా కత్తి సినిమాలో నటించారు. అందం, ప్రతిభ ఉన్నప్పటికీ, ఆమెకు హీరోయిన్ అవకాశాలు రాలేదు. అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ఉన్న శరణ్య.. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సింబుకు తాను భరతనాట్యం నేర్పించినట్లు చెప్పారు.
శరణ్య నటి మాత్రమే కాదు భరతనాట్య కళాకారిణి కూడా. ఈ నేపథ్యంలోనే, నటుడు సింబు "మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కేరళ వచ్చినప్పుడు, అతని తలకు స్వల్ప గాయమై ఆసుపత్రిలో చేరారు. శరణ్య భర్త వైద్యుడు కావడంతో, ఈ విషయం తెలుసుకున్న శరణ్య సింబును చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారట.