సమంత, తమన్నా, అనుష్క, కాజల్, రకుల్... ఈ స్టార్ హీరోయిన్స్ ఆ స్టార్ హీరోలతో అఫైర్స్ నడిపారట?

First Published Jun 16, 2021, 8:43 AM IST


ప్రేమ విశ్వవ్యాప్తంగా అంటారు. అది ఎక్కడైనా ఎవరి మధ్య అయినా పుడుతుంది. అయితే  హీరో హీరోయిన్స్  మధ్య ప్రేమ వ్యవహారాలంటే సాధారణ జనాలకు వారి ఫ్యాన్స్ కి మహా ఆసక్తి ఉంటుంది. స్టార్స్ ప్రేమ కథలు కొన్ని సార్లు అధికారికంగామారి పెళ్లి వరకు వెళతాయి. కొన్ని మాత్రం రూమర్స్ గానే మిగిలిపోతాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన సమంత, అనుష్క, కాజల్, తమన్నా, రకుల్, త్రిషా కొందరు హీరోలతో అఫైర్స్ నడిపినట్లు పుకార్లు రావడం జరిగింది. ఆ హీరోలు ఎవరో చూద్దామా... 
 

స్వీటీ అనుష్క లవ్ అఫైర్స్ గురించి చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రభాస్. అనుష్క-ప్రభాస్ జంట ఏకంగా నాలుగు సినిమాలు కలిసి చేశారు. బాహుబలి మూవీ సమయంలో వీరు ప్రేమలో పడ్డారని పుకార్లు వచ్చాయి. ఆ వార్తలను ఇద్దరూ ఖండించారు. ప్రభాస్ కంటే ముందు హీరో గోపీచంద్ తో అనుష్క ఎఫైర్ పెట్టుకున్నట్లు పుకార్లు రావడం విశేషం.
undefined
గత ఏడాది అక్టోబర్ లో కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం చాలా కాలంగా ఉందని సమాచారం. అయితే టాలీవుడ్ హీరోలు అయినా రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్ లతో కాజల్ ప్రేమలో పడ్డట్లు వార్తలు రావడం జరిగింది.
undefined
సమంత అక్కినేని చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటి చూపులోనే వీరు ప్రేమలో పడ్డట్లు వార్తలు వచ్చాయి. నిజానికి 2013లో హీరో సిద్ధార్థతో సమంత ప్రేమలో పడ్డట్లు సమాచారం. జబర్ధస్త్ మూవీలో కలిసి నటించిన ఈ జంట కొన్నాళ్ళు డేటింగ్ చేశారని పుకార్లు గుప్పుమన్నాయి. ఈ పుకార్లలో నిజం లేకపోలేదని తరువాత సమంత పరోక్ష వ్యాఖ్యలు రుజువు చేశాయి.
undefined
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ విషయంలో ఏం తక్కువగా కాదు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాను తమన్నా ప్రేమించారని అప్పట్లో పుకార్లు రావడం జరిగింది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేయగా మీడియా ప్రముఖంగా వీరి ఎఫైర్ గురించి వార్తలు రాయడం జరిగింది. గతంలో హీరో కార్తీతో కూడా తమన్నా డేటింగ్ చేసినట్లు వార్తలు రావడం జరిగింది. అయితే అలాంటిది ఏమీ లేదని తమన్నా ఖండించారు.
undefined
టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి చెక్కేసిన రకుల్ ప్రీత్ సింగ్ రానా దగ్గుబాటికి చాలా క్లోజ్. వీరిద్దరూ మంచి స్నేహితులు అని సమాచారం. అయితే వీరిది కేవలం స్నేహం కాదని, ప్రేమ వ్యవహారం అని మీడియాలో కథనాలు రావడం జరిగింది. రకుల్ ఈ వార్తలపై స్పందిస్తూ అవి పుకార్లు మాత్రమే అని చెప్పారు.
undefined
మరో స్టార్ హీరోయిన్ త్రిషా రానా దగ్గుబాటితో సీరియస్ ఎఫైర్ నడిపినట్లు మీడియా కోడై కూసింది. వీరిద్దరి ప్రైవేట్ పిక్స్ కూడా బయటికి రావడంతో వార్తలకు బలం చేకూర్చినట్లు అయ్యింది. రానా పెళ్లి కుదిరాక రానాను టార్గెట్ చేస్తూ త్రిషా చేసిన సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం రేపాయి. ప్రస్తుతం హీరో శింబుతో ఆమె సన్నిహితంగా ఉంటున్నారు.
undefined
click me!