2022లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, 'పాకిస్థాన్లోని ప్రజలు మన సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా భావిస్తారు. కానీ మన దృష్టిలో వారే ఉగ్రవాదులు. కాబట్టి, దృక్కోణం మారుతుంది. మనం హింసను అర్థం చేసుకోలేదు' అని ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. శత్రు దేశ సైన్యంపై దయ చూపకూడదని, వారు మన దేశ శత్రువులని చాలామంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
ఇప్పుడు, కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని సాయి పల్లవి తీవ్రంగా ఖండించి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఆమె గత వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ #BoycottSaiPallavi అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఆమె భవిష్యత్ సినిమాలపై ప్రభావం పడుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
Also Read: తినడానికి తిండి లేక పస్తులున్నా, జబర్దస్త్ చమ్మక్ చంద్ర నవ్వుల వెనుక విషాద కథ