ఎస్పీ బాలు తన కెరీర్ లో జరిగిన సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. నా కెరీర్ లో నేను అతి కొద్దిమంది నటులకు మాత్రమే గొంతు మార్చి పాడవలసి వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు గొంతు మార్చి పాడేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటివరకు ఎన్టీఆర్, ఏఎన్నార్ పాటలలో ఘంటసాల గారి గొంతు జనాలకు బాగా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత నేను పాడుతుంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ గొంతుకు మ్యాచ్ అయ్యేది కాదు. దీనితో గొంతు మార్చి పాడేందుకు శ్రమించాను. కొన్ని రోజుల తర్వాత నాకు గ్రిప్ దొరికింది అని ఎస్పీ బాలు అన్నారు.