Ramayana: యశ్, రణ్బీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న 'రామాయణం' సినిమాను రెండు భాగాలుగా ఎందుకు తీస్తున్నారో మేకర్స్ అసలు రహస్యం బయటపెట్టారు. మొదటి భాగం చూశాక, రెండో భాగం కోసం ప్రేక్షకులు కచ్చితంగా ఎదురుచూసేలా కథను అల్లినట్లు టీమ్ చెబుతోంది.
'రామాయణం' సినిమాను రెండు భాగాలుగా ఎందుకు తీస్తున్నారు? ఈ పెద్ద సీక్రెట్ను శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2026 స్టేజ్పై చిత్ర బృందం బయటపెట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రస్టీజియస్ సినిమాపై గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే ప్రశ్నకు డైరెక్టర్ నితేష్ తివారీ, టీమ్ సమాధానం ఇచ్చింది.
26
రామాయణం కథ చాలా పెద్దది
ఈ ఇతిహాసం చాలా పెద్దది! శాన్ డియాగో కామిక్-కాన్లో జరిగిన ఈవెంట్లో రణ్బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నితేష్ తివారీ మాట్లాడుతూ.. 'రామాయణం కథ చాలా విస్తృతమైంది. దాన్ని కేవలం 3 గంటల సినిమాలో ఇమడ్చడం అసాధ్యం' అని అన్నారు.
36
ఆత్మ దెబ్బతింటుంది
ఈ ఇతిహాసంలోని ప్రతి పాత్రకు, ప్రతి సన్నివేశానికి న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం. కథను కట్ చేసి ఒకే భాగానికి పరిమితం చేస్తే దాని ఆత్మ దెబ్బతింటుంది. అందుకే దీన్ని రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాం' అని వివరించారు. అంతేకాదు, మొదటి భాగం చూశాక.. తర్వాత ఏం జరుగుతుందా? అనే క్యూరియాసిటీ పీక్స్కి వెళ్తుంది. పార్ట్ 1 ముగియగానే, పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూసేలా కథను అద్భుతంగా అల్లినట్లు టీమ్ చెప్పింది.
లీకైన విజువల్స్, వైరల్ అయిన టీజర్! చిత్ర బృందం ఇంకా అధికారికంగా ట్రైలర్ను ఆన్లైన్లో రిలీజ్ చేయలేదు. కానీ న్యూఢిల్లీ, ముంబై, ఇప్పుడు శాన్ డియాగోలో జరిగిన ప్రదర్శనలప్పుడు కొందరు సీక్రెట్గా తీసిన వీడియో క్లిప్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ చూసిన అభిమానులు సినిమా గ్రాండియర్కు ఫిదా అయిపోతున్నారు. పైరసీని అడ్డుకోవడానికి నిర్మాత నమిత్ మల్హోత్రా లీగల్ టీమ్ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సోషల్ మీడియాలో 'రామాయణం' హవా మాత్రం తగ్గడం లేదు.
56
రామాయణ్ భారీ తారాగణం
ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతగా, మన రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా గర్జించబోతున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబేతో పాటు అరుణ్ గోవిల్, లారా దత్తా వంటి దిగ్గజ నటులు ఈ చిత్రంలో ఉన్నారు. ఇక మ్యూజిక్ లెజెండ్స్ హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
66
దీపావళికి రామాయణ్ రిలీజ్
మొత్తం మీద, నవంబర్ 2026లో ఈ విజువల్ వండర్ థియేటర్లలోకి రానుంది. ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చూపించడానికి చిత్ర బృందం సిద్ధమైంది. రణ్బీర్, యశ్ మధ్య ఫేస్-ఆఫ్ చూడటానికి అభిమానులు ఇప్పటి నుంచే కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు.