రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించాల్సి మిస్ అయిన సినిమా ఏదో కాదు ఎవడు. అవును ఈసినిమాలో రామ్ చరణ్ హీరోగా అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో నటించారు. శృతీ హాసన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటించిన ఈసినిమాలో అమీ జాక్సన్ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేశారు. అయితే ఈసినిమాలో అల్లు అర్జున్ పాత్ర కోసం డైరెక్టర్ వంశీపైడిపల్లి ముందుగా ఎన్టీఆర్ ను సంప్రదించారట. కాని ఆ టైమ్ లో తారక్ ఫుల్ బిజీగా ఉండటంతో ఈ సినిమాచేయడానికి టైమ్ దొరకలేదని తెలుస్తోంది. దాంతో అల్లు అర్జున్ ను ఈసినిమా కోసం తీసుకున్నారు. అలా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఓ మల్టీ స్టారర్ మూవీ ముందే మిస్ అయ్యారు.
Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?