jayalalitha, rajinikanth
రజనీకాంత్ తాజాగా తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మాజీ సీఎం జయలలితతో గొడవని బయటపెట్టారు రజనీ. ఆయన వ్యాఖ్యలు పెద్ద రచ్చ అవుతున్నాయి. మరి ఇంతకి ఏం జరిగిందంటే 1995లో చెన్నైలో జరిగిన ఓ ఘటన రజనీకాంత్ని బాగా బాధించిందట.
basha movie
ఆ విషయాన్ని `బాషా` మూవీ వంద రోజుల సక్సెస్ ఈవెంట్లో వెల్లడించారు. ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే తమిళనాడు రాష్ట్రాన్ని, ఈ ప్రజలను దేవుడు కూడా కాపాడలేడని ఆయన వ్యాఖ్యానించారట. రాష్ట్రంలో బాంబుల మోత మోగుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడట.
అంతేకాదు తమిళనాడులో వారసత్వ రాజకీయాల కారణంగా బాంబుల సంస్కృతి బాగా పెరిగిపోయిందని, రాష్ట్రం స్మశానంగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు అప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయట.
rajinikanth
అయితే `బాషా` సినిమా నిర్మాత వీరప్పన్ రజనీకి మంచి ఫ్రెండ్. ఆ అభిమానంతోనే ఆ మూవీని నిర్మించారు. కానీ ఆయన రాజకీయ నాయకుడు కూడా. జయలలిత క్యాబినేట్లో మంత్రిగా ఉన్నారు. రజనీకాంత్ `భాషా` ఈవెంట్ తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వీరప్పన్ ఖండించలేదు. దీంతో జయలలిత ఆగ్రహానికి గురయ్యారు. మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నాడు.
Rajinikanth vs Jayalalitha
ఇది రజనీకి మరింత కోపం తెప్పించింది. ఆ నెక్ట్స్ ఇయర్ తమిళనాడులో ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేశారట. జయలలితకు ఓటు వేయోద్దని ఆయన ప్రచారం చేయడంతో అన్నాడీఎంకే ఓటమి పాలయ్యింది. ఏకంగా ప్రభుత్వమే కూలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయంపై రజనీకాంత్ కొంత కాలానికి రియలైజ్ అయ్యారు. తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నారట. రజనీకాంత్ వల్లే తాను ఓడిపోయినా, ఆ తర్వాత ఆయన పెద్ద కుమార్తె పెళ్లికి జయలలిత వెళ్లడం విశేషం. ఈ విషయాన్ని లేటెస్ట్ గా రజనీకాంత్ బయటపెట్టారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు మరోసారి తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.