3 కోట్ల వాచ్.. 3 లక్షల షూస్.. రామ్ చరణ్ వాడే వస్తువుల కాస్ట్ తెలీస్తే కళ్ళుతిరగాల్సిందే

First Published Dec 19, 2022, 4:40 PM IST

రామ్ చరణ్ స్టైలీష్ లుక్స్ ప్రస్తతం వైరల్ అవుతున్నాయి. ఆయన వాడే బ్రాండెడ్ వస్తువులు నెట్టింట్లో చర్చనీయాంశం అవుతున్నాయి. 

టాలీవుడ్ హీరోలు స్టైలీష్ గా మెయింటేన్ చేయడంతో.. బాలీవుడ్ ను మించిపోతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ ఈ విషయంలో ముందుండేది. కాని బాలీవుడ్ ను వెనక్కి నెట్టి మన హీరోలు రచ్చరచ్చచేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ స్టైలీష్ లుక్స్ ప్రస్తతం వైరల్ అవుతున్నాయి. ఆయన వాడే బ్రాండెడ్ వస్తువులు నెట్టింట్లో చర్చనీయాంశం అవుతున్నాయి. 

టాలీవుడ్ లె అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మహేష్ బాబు.. ఇలా స్టైలీష్ ఐకాన్స్ చాలా మంది ఉన్నారు. వారు వాడే వస్తువులు, వెసుకునే డ్రెస్, షూస్ లాంటివి ఎప్పుడూ ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా రామ్ చరణ్ కూడా ఇలానే వార్తల్లో నిలిచారు. 
 

రామ్ చరణ్ వాడే వాచ్ తో పాటు షూస్ కూడా నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వాటి రేటు తెలిస్తే నిజంగా కళ్లుతిరాగాల్సింది. చరణ్ వాడే... వాచ్ కంపెనీ పేరు  రిచర్డ్ మిల్లే దీని ధర అక్షరాలా 3 కోట్ల 34 లక్షల వరకూ ఉంటుంది. అలాగే ఆయన వాడే నైక్ కంపెనీ షూస్ రేటు అక్షరాలా 3 లక్షల 60 వేలు.. 
 

ఈ విషయం తెలసి అంతా షాక్ అవుతున్నారు మన వాళ్ల మెయింటేనెస్ తో ఎంత మంది బ్రకొచ్చో.. అంతెందుకు చరణ్ వాడే నార్మల్ శాండల్స్ గుచీ చెప్పుల ధరే 5‌0 వేల పైనే ఉన్నాయంటే బుర్ర తిరక్కుండా ఉంటుందా చెప్పండి. 
 

ఇక రామ్ చరణ్ లావిషింగ్ హౌస్, లగ్జరీ కార్స్, హార్సెస్, పెట్స్, గాగుల్స్ నుండి వాచెస్ వరకు.. వాటి బ్రాండ్స్, కాస్ట్ గురించి ఇప్పటికే చాలా వార్తలు, విశేషాలు చూశాం.. ఇప్పుడు చెర్రీ వాచ్, షూస్ అండ్ శాండల్స్ గురించిన సమాచారం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది.. ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్ అటునుండి అటు వెకేషన్‌కి వెళ్లాడు.. తిరిగి హైదరాబాద్ వచ్చి.. మళ్లీ న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడ చెర్రీ స్టైలిష్ లుక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇటీవల రామ్ చరణ్‌కి ట్రూ లెజెండ్ అవార్డ్ రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో చెర్రీ ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్నాడు.. 
 

చరణ్, శంకర్ కాంబినేషన్‌లో.. దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ RC15.. పలు కారణాలతో ఇప్పటివరకు షూటింగ్‌కి కొంచెం గ్యాప్ వచ్చింది.రీసెంట్ గా  న్యూజిలాండ్‌లో ఓ షెడ్యూల్ చేసి వచ్చారు.. 

అలాగే ఇక తాము ముగ్గురం కాబోతున్నాం.. మెగా ఫ్యామిలీ పెద్దది అవబోతుందంటూ.. చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.. పెళ్లైన పదేళ్లకు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పడం విశేషం..
 

click me!