రాజశేఖర్ ప్రభంజనంతో చిత్తైపోయిన మహేష్ సినిమా ఏదో తెలుసా.. జీవితంలో అలాంటి క్యారెక్టర్ చేయనని చెప్పిన నటి

Published : Sep 06, 2025, 04:36 PM IST

మహేష్ బాబు, రాజశేఖర్ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భం ఉంది. ఊహించని విధంగా ఆ పోటీలో రాజశేఖర్ మూవీ విజయం సాధించింది. 

PREV
15

యాంగ్రీ హీరో రాజశేఖర్ గతంలో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా రాణించారు. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ రాజశేఖర్ చిత్రాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇటీవల రాజశేఖర్ జోరు తగ్గింది. సినిమాలు కూడా తగ్గించారు. రాజశేఖర్ చిత్రాలు టాలీవుడ్ అగ్ర హీరోలకు పోటీగా థియేటర్స్ లో రాణించేవి.

25

దాదాపు 22 ఏళ్ళ క్రితం రాజశేఖర్ నటించిన ఒక చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీకి పోటీగా విడుదలయింది. ఈ పోటీలో రాజశేఖర్ మూవీ ప్రభంజనానికి మహేష్ చిత్రం చిత్తైపోయింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 2003 సమ్మర్ లో మే 22న రాజశేఖర్ నటించిన ఆయుధం చిత్రం విడుదలైంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో గుర్లీన్ చోప్రా, సంగీత హీరోయిన్లుగా నటించారు.

35

ఆహుతి ప్రసాద్, శివాజీ, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఒక రోజు గ్యాప్ లో మహేష్ బాబు, తేజ కాంబినేషన్ లో వచ్చిన నిజం చిత్రం విడుదలయింది. మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ నిజం మూవీ ఏమాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో కొన్ని ఓవర్ డ్రమాటిక్ సీన్లు ఫ్యాన్స్ కి నచ్చలేదు. కానీ రాజశేఖర్ ఆయుధం మూవీ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

45

ఆయుధం చిత్రంలో కూడా ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా మంచి సందేశం ఉంటుంది. నిజం చిత్రంలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ కూడా ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇదిలా ఉండగా ఈ మూవీలో రాశి విలన్ గా నటించిన గోపీచంద్ పక్కన నటించింది. ఆమె నెగిటివ్ రోల్ లో నటించింది.

55

రాశి ని చూపించిన విధానం కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. రాశి కూడా తన పాత్ర విషయంలో చాలా మనస్తాపానికి గురైంది. డైరెక్టర్ తేజ తన పాత్రని ఒకలా చెప్పి మరోలా చేశారని రాశి ఆరోపించింది. జీవితంలో అలాంటి క్యారెక్టర్స్ చేయనని రాశి తేల్చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories