ఇంతకీ ఆమె ఎవరో కాదు, నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గన్నోర గ్రామానికి చెందిన లక్ష్మి. చిన్ననాటి నుంచి పాటలపై ఆసక్తి ఉన్న లక్ష్మి, ఫోక్ సాంగ్స్ ద్వారా విపరీతమైన గుర్తింపు పొందింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన పుష్ప 2 సినిమాలో “ వస్తున్నాయ్ ఫీలింగ్స్ పాటతో బాగా ఫేమస్ అయింది లక్ష్మి.
అంతకంటే ముందు తిన్నా తీరం పడుతలే.. కూసున్నా తీరం పడుతలే, ఆనాడేమన్నంటినా తిరుపతి వంటి జానపద పాటలు లక్ష్మీకి మంచి పేరు తీసుకురావడంతో పాటు సెలబ్రిటీని చేశాయి.
యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ను రాబట్టిన ఈ పాటలు, లక్ష్మికి సినిమా రంగంలో పాడే అవకాశాలను తెచ్చిపెట్టాయి. ఆమె బ్యాచ్, దసరా సినిమాల్లో పాటలు పాడారు. ఆమె పాడిన పాటలకు అద్భుతమైన స్పందన కూడా అందుకుంది.