'రామాయణం' సినిమా రెండు భాగాల్లో దాదాపు 20 మంది నటులు నటిస్తున్నారు. రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు.
వీరితోపాటు అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఇందిరా కృష్ణన్, శిబా చత్తా, మోహిత్ రైనా, కునాల్ కపూర్, వివేక్ ఒబెరాయ్, శోభనా, అమితాబ్ బచ్చన్ వంటి వారు కూడా నటిస్తున్నారు. సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదలవుతుందని ప్రకటించారు.