కొడుకు మార్క్ శంకర్‌ ప్రాణాల కోసం మతం పక్కన పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ భార్య, తిరుమల శ్రీవారికి మొక్కు

Pawan Kalyan son Mark Shankar:  డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కొడుకు మార్క్ శంకర్‌, భార్య అన్నా లెజినోవాతో హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఈ రోజు సాయంత్రం తిరుమల చేరుకున్నారు. అక్కడ ఈ రోజు రాత్రి బస చేసి రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సింగపూర్‌లో ఇటీవల కొడుకు అగ్నిప్రమాదానికి గురై విషయం తెలిసిందే. పెద్ద ప్రమాదం నుంచి కొడుకు ప్రాణాలతో బయటపడిన నేపథ్యంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకోబోతున్నారు పవన్‌ కుటుంబం. 
 

pawan kalyan wife anna konidela prays tirumala srivaru for son safe in telugu arj
Pawan Kalyan

Pawan Kalyan son Mark Shankar: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొడుకు సింగపూర్‌లో అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. చిన్న చిన్న గాయాలతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, క్రమంగా కోలుకున్నారు. విషయం తెలిసి ఆ వెంటనే పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవి, సురేఖ సింగపూర్‌ వెళ్లారు.

దగ్గరుంచి కొడుకుని చూసుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కోలుకున్నాడు. దీంతో సింగపూర్ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం పవన్‌ తన కొడుకు మార్క్ శంకర్‌, భార్య అన్నా లెజినోవాతో కలిసి హైదరాబాద్‌ వచ్చారు పవన్‌. 
 

pawan kalyan wife anna konidela prays tirumala srivaru for son safe in telugu arj
Pawan Kalyan’s son Mark Shankar

అనంతరం తిరుపతికి చేరుకున్నారు. ఈ రోజు రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. రేపు సోమవారం ఉదయం శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకోనున్నారు.

కొడుకు మార్క్ శంకర్‌ పెద్ద ప్రమాదం నుంచి బయటపడటంతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే పవన్‌ తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి మరో కారణం ఉంది. తన భార్య అన్నా లెజినోవా శ్రీవారిని మొక్కుకోవడం విశేషం. 


సింగపూర్ లో ఘటన జరిగిన నేపథ్యంలో తన కొడుకు ప్రాణాలతో బయటపడాలని, ఎలాంటి అపాయం జరగకూడదని ఆమె తిరుమల శ్రీవారిని మొక్కకుందట. మొక్కు ఫలించింది. కొడుకు చిన్న చిన్న గాయాలతో పెద్ద ప్రమాదం లేకుండా బయటపడ్డాడు.

ఇప్పుడు దాదాపుగా కోలుకున్నాడు. దీంతో శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వెల్లడం విశేషం. అయితే ఇక్కడే ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. పవన్‌ భార్య అన్నా స్వతహాగా క్రిస్టియన్‌. కానీ కొడుకు ప్రాణాల కోసం తన మతాన్ని పక్కన పెట్టి తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కుకోవడం విశేషం. 
 

ఇక తిరుమలలో ప్రతి రోజు మూడు పూటల ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి ఎంతో మంది భక్తులు దానాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అన్నా లెజినోవా కూడా అన్నప్రసాదంకి విరాళం ఇవ్వనున్నారట. కొడుకు సురక్షితంగా బయటపడిన నేపథ్యంలో,

ఎంతో మంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రార్థనలు చేసిన నేపథ్యంలో తనవంతు సాయంగా ఆమె అన్నదాన కార్యక్రమానికి విరాళం అందిస్తున్నారట. ఇలా పవన భార్య చేస్తున్న పని పట్ల అభిమానులు, కార్యకర్తలే కాదు, సాధారణ జనం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

read more: సీఎం సీఎం నినాదాలు, ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఇదే.. తారక్‌ని బ్రతిమాలుకున్న విజయశాంతి

also read: Vishwambhara Story Leak: ఏడు లోకాలు, ఏడు గెటప్‌లు, సెకండాఫ్‌ మొత్తం అదే.. `విశ్వంభర` స్టోరీ లీక్

Latest Videos

vuukle one pixel image
click me!