చిరంజీవి డైనోసార్ లా వచ్చి పడడంతో అడ్రెస్ లేకుండా పోయిన ఎన్టీఆర్ మూవీ..రెండు చిత్రాలకు ఒక్కరే డైరెక్టర్

Published : Sep 09, 2025, 10:10 AM IST

చిరంజీవి, ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఆ రెండు చిత్రాలకు ఒక్కరే దర్శకుడు. మరి ఆ చిత్రాల రిజల్ట్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15

టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే ఆ పోటీ తీవ్రంగా ఉంటుంది. బాక్సాఫీస్ లెక్కలపై అందరి దృష్టి పడుతుంది. ఏ సినిమా సక్సెస్ అవుతుంది అనే ఉత్కంఠ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది అగ్ర హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి హీరోల చిత్రాలకు పోటీగా చిరంజీవి సినిమాలు విడుదలయ్యేవి. ఆ తర్వాత బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లతో పోటీ పడ్డారు. 

25

ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలతో కూడా మెగాస్టార్ పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి, డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన ఇంద్ర చిత్రం. ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వారం రోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు చిత్రం విడుదలై థియేటర్స్ లో ప్రదర్శించబడుతోంది. అల్లరి రాముడు చిత్రం 2002 జూలై 18న విడుదలయింది. 

35

ఇక చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రం జూలై 24న విడుదలై డైనోసార్ లాగా అల్లరి రాముడుపై పడింది. అప్పటికే అంతంత మాత్రం టాక్ తో నడుస్తున్న అల్లరి రాముడు చిత్రం.. ఇంద్ర రిలీజ్ కావడంతో థియేటర్స్ లో అడ్రెస్ లేకుండా పోయింది. డిజాస్టర్ గా నిలిచింది. ఇంద్ర మాత్రం టాలీవుడ్ రికార్డులని తిరగరాసింది. 

45

విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ఒక్కరే.. ఆయనే బి గోపాల్. వాస్తవానికి అల్లరి రాముడు చిత్రం ఇంద్ర చిత్రానికి రెండు వారాల ముందే రిలీజ్ కావాలని బి గోపాల్ అన్నారు. కానీ సౌండ్ మిక్సింగ్ లో తేడా జరిగింది. దానిని సెట్ చేయడానికి మరో వారం అల్లరి రాముడు చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. దీని వాళ్ళ అల్లరి రాముడు, ఇంద్ర చిత్రాల మధ్య వారం మాత్రమే గ్యాప్ ఏర్పడింది. అల్లరి రాముడు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుందని.. సెకండ్ హాఫ్ కథ బాగాలేదని అందుకే ఫ్లాప్ అయింది అని బి గోపాల్ అన్నారు. 

55

ఇంద్ర, అల్లరి రాముడు చిత్రాలకు రెండు వారాల గ్యాప్ ఉండిఉంటే.. అల్లరి రాముడు మూవీకి ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ఉండేవి. ఆ మూవీలో ఆకుచాటు పిందె తడిసె సాంగ్ ని రీమిక్స్ చేయడం బాగా కుదిరింది అని బి గోపాల్ అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories