ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్న హీరో కార్తికేయ గుమ్మకొండ 29ఏళ్లకు చక్కగా పెళ్లి పీటలు ఎక్కాడు. తనకు నచ్చిన, మెచ్చిన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. నవంబర్ 21న హైదరాబాద్ వేదికగా కార్తికేయ వివాహం ఘనంగా జరిగింది.
తన చిన్ననాటి ఫ్రెండ్, ప్రేయసి లోహితను పెళ్లి చేసుకున్నాడు. ఇష్టసఖి మెడలో మూడు ముళ్ళు వేసి, ఏడడుగులు నడిచారు. లోహిత చాలా అందంగా ఉండగా, నూతన వధూవరులు పెళ్లి మండపంలో చందమామ వలె మెరిసిపోయారు.
కార్తికేయ (Karthikeya) వివాహానికి మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)హాజరుకావడం విశేషం. చిరు స్వయంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చిరంజీవితో కార్తికేయకు ప్రత్యేక అనుబంధం ఉంది. జీ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో కార్తికేయ తన స్పీచ్ తో చిరు కళ్ళలో నీరు తెప్పించారు. అప్పటి నుండి చిరుకు కార్తికేయపై ప్రేమ ఏర్పడింది.
అలాగే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సైతం ఈ వివాహానికి హాజరయ్యారు. కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా మూవీ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కగా, అల్లు అరవింద్ సమర్పకులుగా ఉన్నారు.
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చిన కార్తికేయ ఆర్ ఎక్స్ 100 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తర్వాత ఆయన నటించిన గుణ 369 సైతం హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఆర్ ఎక్స్ 100 రేంజ్ హిట్ తనకు మరలా దక్కలేదు. కార్తికేయ వివాహానికి ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన బాయ్ ఫ్రెండ్ తో పాటు హాజరైంది.
ఇక కార్తీకేయ తన లేటెస్ట్ మూవీ రాజావిక్రమార్క లో ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ఏజెంట్ గా పర్ఫెక్ట్ బాడీ, యాక్టింగ్ తో కార్తికేయ మాత్రం ఆకట్టుకున్నారు.