హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలు కోసం 110 పైగా దేశాల నుంచి సుందరీమణులు, అతిథులు, నిర్వాహకులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరి భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదు. ఇండియా పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఏకంగా 5000 మందితో తెలంగాణ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని కంటెస్టెంట్లు బస చేసే హోటల్ వద్ద సాయుధ పోలీసులు, నిఘా వర్గాల లతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.