కథ :
2064లో 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. ఆ తర్వాత బ్రతికున్న జనాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది? నెలల తరబడి తిండి లేక మనుషులు ఎలా అయిపోతారు. ఈ క్రమంలో బుద్ధిబలం కలిగిన వారు రెసిడెన్స్ ను ఏర్పాటు చేసుకోగా.. మిగిలిన వారు అల్ప జనాలుగా మిగిలిపోతారు. వాళ్ళ కోసం పోరాడే వాళ్ళు లిబరేటర్స్ గా ఏర్పడతారు. వీళ్ళలో ఒకడు శక్తి(కిషోర్).
ఒక రోజు ఫుడ్ క్యాన్స్ కోసం అతను , అతని టీం రెసిడెన్స్ వారి ట్రక్ పై బాంబ్ అటాక్ చేయగా...ఆ విషయం రెసిడెన్స్ వారికి తెలిసి లిబరేటర్స్ ను ఘోరంగా చంపేస్తారు. వీళ్ళలో శక్తి ఒక్కడే బ్రతికి బయటపడతాడు. అయితే అతను తీవ్రంగా గాయపడటంతో నీళ్ల కోసం, తిండి కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అతనిలానే రతి అనే అమ్మాయి కూడా తిండి కోసం, నీటి కోసం వెతుకుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఇద్దరూ ఫుడ్ క్యాన్స్ కోసం గొడవ పడతారు. చివరికి రతి.. శక్తి చేతిలో చనిపోతుంది. తర్వాత రెసిడెన్స్ కు చెందిన వారు అటాక్ చేయడంతో శక్తి పారిపోతాడు. ఈ సమయంలో అతనికి ఒక మైక్ దొరుకుతుంది. అందులో ఓ వ్యక్తి సేఫ్ హౌస్ లోకి రమ్మని చెబుతాడు. ఆ వెంటనే సేఫ్ హౌస్ కి వెళ్తాడు శక్తి.
అక్కడ ఇతనికి ఓ వ్యక్తి పరిచయమై తిండి పెడతాడు. నీళ్లు కూడా ఇస్తాడు. అతనికి మాత్రమే అంత అందమైన ఇల్లు, తినడానికి తిండి, నీరు ఎలా దొరుకుతున్నాయి. అతన్ని చంపేసి అక్కడే సెటిల్ అయిపోదాం అని శక్తి ఆలోచిస్తాడు. మరి అతని ప్లాన్ ఏమైంది? తర్వాత భూమి(శ్రద్దా శ్రీనాథ్) అదే ఇంట్లోకి ఎందుకు వచ్చింది.? ఆ సేఫ్ హౌస్ లో ఉన్న వ్యక్తి ఎవరు? అనేది మిగిలిన కథ.