Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర

Published : May 19, 2026, 06:22 PM IST

Ilaiyaraaja Karuppu Controversy: ఇసైజ్ఞాని ఇళయరాజా పేరును వాడటంపై వివాదం చెలరేగడంతో 'కరుప్పు' సినిమాలోని ఒక వివాదాస్పద సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు క్షమాపణలు కూడా చెప్పింది.

PREV
15
కరుప్పు సినిమాకి ఇళయరాజా ఎఫెక్ట్

తన అనుమతి లేకుండా తన పాటలను, ట్యూన్స్ ని వాడితే ఇటీవల వరుసగా కాపీరైట్‌ కేసులు వేస్తున్నారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఇది వరుసగా వివాదంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు సూర్య నటించిన `కరుప్పు` సినిమాకి దెబ్బ పడింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిష, ఇంద్రన్స్, స్వాసిక, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుగళం నరేన్ వంటి చాలా మంది నటులు కీలక పాత్రలు పోషించారు. సాయ్ అభియాంకర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

25
అడ్డంకులు దాటి రిలీజ్

రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన 'కరుప్పు' సినిమా, ఎన్నో అడ్డంకులను దాటుకుని థియేటర్లలోకి వచ్చింది. మొదట ఈ సినిమాను మే 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. దీంతో అభిమానులు చాలా నిరాశ చెందారు. ఆ సమయంలో డైరెక్టర్ ఆర్జే బాలాజీ రిలీజ్ చేసిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

35
పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న సినిమా

అన్ని సమస్యలను పరిష్కరించుకుని, మే 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. విడుదలైన మొదటి రోజు నుంచే 'కరుప్పు' సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. చాలా కాలం తర్వాత సూర్య ఒక పక్కా మాస్ హీరోగా తిరిగి వచ్చాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. స్కూల్ సెలవులు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారని టాక్.

45
కరుప్పు కథ ఏంటి?

ఈ సినిమా కథ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కోర్టులో జరిగే అన్యాయాలపై 'కరుప్పసామి' అవతారంలో సూర్య పోరాటం చేస్తాడు. అతనికి, లాయర్ బేబీ కన్నన్‌గా నటించిన ఆర్జే బాలాజీకి మధ్య జరిగే గొడవే ఈ సినిమా కథ. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే  `పడి కరుప్పు` సీన్స్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

55
ఇళయరాజా వివాదం

ఇలాంటి టైమ్‌లో, ఈ సినిమాలోని ఒక సీన్ వివాదానికి దారితీసింది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఒక సీన్‌లో 'అలై ఓసై' సినిమాలోని "పోరాడడా" పాట వస్తుంది. ఆ తర్వాత ఇళయరాజాను కించపరిచేలా ఒక డైలాగ్ ఉందని కొందరు ఆరోపించారు. దీనిపై సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై చిత్ర బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఇసైజ్ఞాని ఇళయరాజా గారిని కించపరిచే ఉద్దేశం మాకు అస్సలు లేదు. కథలో భాగంగానే ఆ సీన్ పెట్టాం. దీనివల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే, మేము మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం" అని ఆ ప్రకటనలో టీమ్ పేర్కొంది. అంతేకాదు ఆ సీన్‌ని కూడా తీసేశారట. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories