తన అనుమతి లేకుండా తన పాటలను, ట్యూన్స్ ని వాడితే ఇటీవల వరుసగా కాపీరైట్ కేసులు వేస్తున్నారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఇది వరుసగా వివాదంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు సూర్య నటించిన `కరుప్పు` సినిమాకి దెబ్బ పడింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిష, ఇంద్రన్స్, స్వాసిక, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుగళం నరేన్ వంటి చాలా మంది నటులు కీలక పాత్రలు పోషించారు. సాయ్ అభియాంకర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.